శ్రీవారి సన్నిధిలో రామ్‌చరణ్‌ దంపతులు

13
- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రామ్ చరణ్ దంపతులు. ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న చరణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య ఉపాసనతో పాటు కూతురు క్లింకార కూడా ఉన్నారు. రామ్ చరణ్ దంపతులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనంతరం వారిని దీవించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అర్చకులు.

ఇక ఇవాళ చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ ఛేంజర్ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా విజువల్ ట్రీట్‌గా ఉంది ఈ సాంగ్. చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుడగా చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

Also Read:సీఎం రేవంత్‌తో వీహెచ్‌ భేటీ

- Advertisement -