బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ కనిపిస్తుండగా సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్తైనా వైరల్గా మారుతోంది.
త్వరలో తమిళనాడులో కీలక షెడ్యూల్ జరపనుండగా, ఆ షెడ్యూల్లో చరణ్, ఎన్టీఆర్పై ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తారట. అయితే షెడ్యూల్ గ్యాప్లో కాస్త ఖాళీగా ఉన్న చెర్రీ ముంబైలో దర్శనమిచ్చాడు. ముంబైలో బ్యూటీ కియారా అద్వానితో కలిసి ఫోటో దిగారు చరణ్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో వీరిద్దరూ వినయ విధేయ రామ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
ఇద్దరు బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ లో అక్కడున్న ఫోటో గ్రాఫర్లకు ఫోజ్ ఇచ్చారు. రామ్ చరణ్ తాజా లుక్ ఆసక్తికరంగా ఉంది. బాగా మెలితిప్పిన మీసంలో రామ్ చరణ్ రఫ్ లుక్ లో చాలా బాగున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30 న విడుదలకానుంది