ఎంబీఏ కోర్సులో చేరిన రకుల్..!

306
rakul
- Advertisement -

కరోనా నేపథ్యంలో ఎప్పుడూ షూటింగులతో బిజీగా వుండే సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. అయితే పలువురు సినీ తారాలు ఈ టైంని సద్వినియోగం చేసుకున్నారు. కొందరు సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించడం, ఇంకొందరు వంటగదిలో చేరి కొత్త వంటకాలు నేర్చుకోవడం, పిల్లలతో ఉడుకోవం వంటివి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌ గత మూడు నెలల పాటు ముంబైలోని తన ఫ్లాట్‌లో వుండిపోయానని చెబుతోంది. అయితే ఈ ఖాళీ సమయంలో తాను చాలా పనులు చేశానని చెప్పింది. పొద్దున్నే ఎక్కువ సేపు వ్యాయామం చేసే దాన్నని, అలాగే తన యూ ట్యూబ్ ఛానెల్ మీద చాలాసేపు వర్క్ చేశానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

అంతేకాదు ఈ అమ్మడు చదువు మీద కూడా దృష్టి పెట్టానని చెబుతోంది. అదేంటి రకుల్ ఇంకా చదువుతోంద అని మీ సందేహం కదా.. అవును ఈ ముద్దుగుమ్మ ఆన్ లైన్ ఎంబీఏ తరగతులకు హాజరయ్యానని చెప్పింది. ఈ విధంగా రకుల్‌ ఈ మూడు నెలల్లో తనకు నచ్చిన వ్యాపకాలతో గడిపానని తెలిపింది. కాగా ఇటీవలే ఢిల్లీలో వున్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది రకుల్‌.

- Advertisement -