ప్రపంచయాత్ర చేయాలనుంది: రకుల్

336
rakul
- Advertisement -

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈమూవీ విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో బిజీగా ఉంది.

తాను భోజన ప్రియురాలినని అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. చిన్నప్పటి నుంచీ మనకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. రకరకాల వెరైటీ రుచుల్ని ఆస్వాదిస్తుంటానని చెప్పారు. ఎప్పటికైనా ప్రపంచ యాత్ర చేయాలనీ, వివిధ దేశాల రుచులను టేస్ట్ చేయాలనీ ఆశగా ఉందని తెలిపింది రకుల్.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు జిమ్‌ సెంటర్‌లను ఏర్పాటుచేసి రెండుచేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమా చేస్తున్న రకుల్ ముంబైలో బిజీగా మారిపోయింది.

- Advertisement -