కరోనా డ్రెస్‌లో ఢిల్లీకి రకుల్.. వైరల్‌

348
rakul
- Advertisement -

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు సడలించడం, విమాన సర్వీసులు పునరుద్దరించడంతో సినీ సెలెబ్రిటీలు రెండు నెలల స్వీయ గృహ నిర్బంధం తర్వాత మళ్లీ బయటి ప్రపంచంలోకి అడుపెట్టారు. తాజాగా తన సినిమా షూటింగ్ కోసం ఇంటి నుంచి కాలు బయటికి పెట్టేసింది అందాల భామ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ముంబై విమానాశ్రయంలో ఈ భామతో పాటు దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా పూర్తిగా ప్లాస్టిక్ దుస్తుల్లో లాక్ అయిపోయింది రకుల్.

గుర్తు కూడా పట్టకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది రకుల్. కానీ ఫోటోగ్రఫర్స్‌కు మాత్రం దొరికిపోయింది. దాంతో వెంటనే రకుల్ ఢిల్లీ ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. తనను గుర్తించడంపై రకుల్ స్పందిస్తూ.. నన్ను ఎవరు గుర్తు పట్టరనే సంతోషంలో ఉన్నాను. కానీ ఫోటోగ్రాఫర్లు నన్ను ఎలాగైనా గుర్తు పట్టేశారు అంటూ చెప్పిన మాటలు వీడియోలో వినిపించాయి.ప్రస్తుతం రకుల్‌ హిందీలో అటాక్ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ కోసమే ఫుల్లుగా ప్రిపేర్ అయిపోయి ఢిల్లీ వెళ్తుంది.ప్రస్తుతం రకుల్ ధరించిన కరోనా డ్రెస్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -