మహేశ్ మూవీలో మ‌రోసారి ఛాన్స్ కొట్టేసిన ర‌కుల్..

260
mahesh rakul
- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షీ అనే సినిమాను చేస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు మ‌రియు అశ్వీనిద‌త్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈమూవీ లో మ‌హేశ్ బాబు రైతుగా, స్టూడెంట్ గా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఈ మూవీని ఎప్రిల్ లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

maharshi

ఇక మ‌హేశ్ త‌న త‌ర్వాతి చిత్రంపై ఆలోచిస్తున్నాడు. ఇటివ‌లే ద‌ర్శ‌కుడు సుకుమార్ చెప్పిన ఓ క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో నో చెప్పాడ‌ని టాక్. తాజాగా సుకుమార్ మ‌రో క‌థ‌ను వినిపించిన‌ట్టు టాక్. ఆక‌థ మ‌హేశ్ కు న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు స‌మాచారం. ఇది కూడా మైండ్ గేమ్ తరహాలోనే సాగే కథ అని అంటున్నారు.ఈసినిమాలో హీరోయిన్ గా ర‌కుల్ ప్రిత్ సింగ్ ను తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. సుకుమార్ తో ర‌కుల్ నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. మ‌హేశ్ తో కూడా స్పైడ‌ర్ సినిమాలో న‌టించింది ర‌కుల్. ఫిబ్ర‌వ‌రి లో ఈమూవీ షూటింగ్ ప్రారంభంకానుంద‌ని స‌మాచారం.

- Advertisement -