ఎఫైర్ గురించే చెప్పేశా.. పెళ్లి ఓ లెక్కా?

22
- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్ పై వచ్చిన పెళ్లి పుకార్లు అన్నీ ఇన్నీ కావు. గడిచిన రెండేళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. కొన్నింటిని ఆమె ఖండించింది, మరికొన్నింటిని లైట్ తీసుకుంది. ఇప్పుడు మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ పై వెడ్డింగ్ రూమర్స్ గుప్పుమంటున్నాయి. అయితే, ఈసారి మాత్రం ఈ టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. దాంతో రకుల్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు ఈ పుకార్ల పై తనదైన శైలిలో వివరణ ఇవ్వక తప్పలేదు.

ఇంతకీ, రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి పై ఏం కామెంట్స్ చేసిందో ఆమె మాటల్లోనే విందాం. ‘ప్రస్తుతం నేను జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నాను. ఈ విషయాన్ని మీడియా ముందే దైర్యంగా చెప్పాను కదా, అసలు ప్రేమ గురించే చెప్పిన దాన్ని పెళ్లి గురించి ఎందుకు చెప్పను ? అంటూ ఎఫైర్ గురించే చెప్పేశా.. పెళ్లి ఓ లెక్కా ? అన్నట్టు మాట్లాడింది. మా ఇద్దరికి పెళ్లి జరిగిందని కొద్దిరోజులుగా వస్తున్న రూమర్స్‌ లో ఏ మాత్రం వాస్తవం లేదు అని రకుల్ చెప్పుకొచ్చింది.

అలాగే రకుల్ ఈ రూమర్స్ పై ఇంకా స్పందిస్తూ.. ”నేను వివరణ ఇస్తూనే ఉన్నా.. నా పెళ్లి గురించి ప్రతివారం ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ వార్తల ప్రకారం అయితే, నేను గతేడాది నవంబర్‌లోనే వివాహం చేసుకున్నాను. ఇంతకీ నా పెళ్లి ఎలా జరిగిందో చెప్పనే లేదు?” అని సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది రకుల్. కానీ ఇప్పుడు అవకాశాల కోసం వెంపర్లాడుతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -