రకుల్ ‘మేడే’ కాదు ‘రన్‌ వే 34’!

79
rakul
- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో పాగా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అజయ్ దేవగణ్ సరసన ఓ సినిమాలో రకుల్ నటిస్తుండగా ఈ సినిమాకు తొలుత మేడే అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ని ఛేంజ్ చేశారు.

ఇందుకు సంబంధించి అఫిషియల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తమ సినిమా పేరును ‘రన్‌వే 34’గా మారుస్తున్నట్లు హీరో అజయ్‌దేవగణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అయితే టైటిల్ మార్పుకు గల కారణాలు తెలియలేదు.

2020 ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అజయ్ దేవగణ్‌తో రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్న రెండో సినిమా ఇది. 2019లో వచ్చిన ‘దే దే ప్యార్‌ దే’ మూవీలో తొలిసారిగా వీరి జంట కనువిందు చేసింది.

- Advertisement -