KGF:రాఖీ భాయి ఎక్కడ? హింట్ ఇచ్చిన హోంబలే..!

49
- Advertisement -

శాండల్‌వుడ్ లో సంచలన సినిమాగా మారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన సినిమా కేజీఎఫ్ సిరీస్‌. తాజాగా దీన్నిపై నిర్మాతలు సంచలనమైన వీడియోను షేర్‌ చేశారు. హోంబలే ఫిల్మ్‌ నిర్మించిన కేజీఎఫ్ సిరీస్‌ ఒకటికి మించి మరొకటి అని బాక్సాఫీస్ వద్ద రికార్డుల బ్రేక్‌ డ్యాన్స్ చేసింది. అంతేకాదు కాసుల కనక వర్షం కురిపించింది.

కేజీఎఫ్ సిరీస్‌లో రెండవ పార్టు విడుదలై శుక్రవారంతో యేడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూడవ భాగం కూడా త్వరలో ఉంటుందని అందుకు సంబంధించిన ఒక వీడియోను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేశారు. అమ్మకిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. నిజంగా నెరవేరిందా? అంటూ వీడియోలో చూపించారు. అంటే మూడవ పార్ట్‌లో ఖచ్చితంగా అమ్మకిచ్చిన వాగ్దానం నెరవేరుస్తారని చెప్పకనే చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ ప్రభాస్ కలిసి సలార్ తీస్తున్నారు. దీన్నిపై భారీ అంచనాలు నెలకొంది. అంతేకాదు ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ రెండింటీ తర్వాత మూడవ భాగం ఉంటుందని శాండల్‌వుడ్‌లో టాక్‌. రావురమేష్ రవీనా టాండన్ ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలో నటించగా శ్రీనిధి షెట్టి హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ ‘వార్ 2’.. అప్పుడే నెగిటివిటీ ?

ప్చ్.. పాపం శాకుంతలం!

Posani:పోసానికి మూడోసారి కరోనా

- Advertisement -