తనుశ్రీ లెస్బీయన్.. రాఖీ సావంత్‌ సంచలన వ్యాఖ్యలు

290
- Advertisement -

బాలీవుడ్ భామ రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. తనుశ్రీ దత్తా లెస్బీయన్ అని.. తనను ఎన్నో సార్లు రేప్ చేసిందని రాఖీ వ్యాఖ్యానించింది. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారని తనుశ్రీ చేసిన ఆరోపణలకు రాఖీ గట్టిగా సమాధానం ఇచ్చింది. పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని.. నానా పటేకర్ తనుశ్రీని కూతురిలా భావిస్తారని ఆమె తెలిపింది. రాఖీ వ్యాఖ్యలకు తనుశ్రీ కూడా ఘాటుగానే స్పందించి, 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయడం బాలీవుడ్ లో దుమారమే చెలరేగింది.

తాజాగా ఓ ఇంటర్య్కూలో రాఖీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తనుశ్రీ ఆడవాళ్ల పట్ల నీచంగా ప్రవర్తించిందని.. అనేక సార్లు తన అనుమతి లేకుండా తనను ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించిందని ఆరోపించింది. మహిళల పట్ల పురుషులు చేసిన లైంగిక వేధింపులపై మొదలైన “మీటూ” ఉద్యమం ఇప్పుడు ఆడవాళ్ల మధ్య పెద్ద రచ్చను క్రియేట్ చేస్తోంది.

ఇదిలా ఉంటే… చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం దర్శకుల వద్దకు వెళ్తారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మహిళలు అవకాశాల కోసమే తమతంట తాము కాస్టింగ్ డైరెక్టర్ల వద్దకు వస్తారని.. ఈ విషయంలో వారిని భయపెట్టేవారు ఎవరూ ఉండరని తెలిపింది. అయితే.. మహిళలను లైంగికంగా వాడుకునే విషయంలో కాస్టింగ్ డైరెక్టరకు బాధ్యత ఉంటుందని అన్నది. ఇక ఈ విషయంలో మగవారు ఆడవాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని రాఖీ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

- Advertisement -