ప్రగతి భవన్‌లో ఘనంగా రాఖీ సెలబ్రేషన్స్..

43
- Advertisement -

రక్షా బంధన్ వేడుకలు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి అధికారిక నివాసంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ సందర్భంగా ప్రేమ ఆప్యాయతలు, సహోదర భావాలు వెల్లివిరిసాయి. సోదరీమణుల రాకతో సీఎం గారి నివాసం లో సందడి నెలకొంది. ఇంటికి వచ్చిన తమ ఆడ బిడ్డలను సీఎం కేసిఆర్ గారి సతీమణి శోభమ్మ సాదరంగా, సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి వారి అక్కలు, లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసిఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.తమ సోదరున్ని నిండు మనసుతో ఆశీర్వదించారు.

అదే సందర్భంలో…సీఎం కేసిఆర్ మనుమడు మనుమరాలు రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది. ఈ సందర్భంగా తమ మనుమడు మనుమరాలును నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని సీఎం కేసిఆర్ శోభమ్మ దంపతులు నిండు మనసుతో దీవించారు. వేడుకల్లో పాల్గొన్న పెద్దలు కూడా చిన్నారులను దీవించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -