చైనా థియేటర్స్‌కి రజనీ రెడీ…

232
- Advertisement -

చైనాలో భారతీయ సినిమాలను రిలీజ్ చేయాలంటే అందుకు ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఏడాదికి ఇన్ని భారతీయ సినిమాలను మాత్రమే అక్కడ విడుదల చేయాలంటూ అక్కడి ప్రభుత్వం అనుమతినిస్తుంది. అక్కడ విడుదలైన ‘దంగల్’ వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డును సృష్టించిందో తెలిసిందే. ఆ తరువాత రజనీ తాజా చిత్రం ‘2.0’ కి అక్కడ ప్రదర్శించడానికి అనుమతి లభించింది.

Rajini's 2.0 to hit screens on 25 January 2018

వచ్చే ఏడాది ఈ సినిమాను అక్కడ విడుదల చేయడానికి ముందుగానే బెర్త్ ను ఖరారు చేసుకున్నారు. చైనాలోను రజనీకాంత్ కి పెద్ద సంఖ్యలోనే ఫ్యాన్స్ వున్నారు. అందువలన ఈ సినిమాను అక్కడ దాదాపు 16 వేల థియేటర్స్ లో విడుదల చేయనున్నట్టు సమాచారం. ఐ మ్యాక్స్ వెర్షన్ తో పాటు త్రీడీ వెర్షన్ ను కూడా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా అక్కడ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో .. ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

రోబోకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాని దర్శకుడు శంకర్‌ భారీ బడ్జెట్‌ తో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపు 350 కోట్లతో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే నిర్మాతలు చాలా సార్లు చెప్పారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటిస్తుండగా ఏర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

- Advertisement -