2.0లో విలనే.. హీరో !

239
Rajinikanth’s 2.0 first look launch
Rajinikanth’s 2.0 first look launch
- Advertisement -

‘రోబో’ సినిమాలో దర్శకుడు శంకర్‌ చిట్టీ పాత్ర ద్వారా చేయించిన హంగామా ప్రేక్షకులెవరూ అంత సాధారణంగా మర్చిపోలేరు. భారతీయ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిన సినిమా అది. ఇప్పుడు ఆయన దానికి సీక్వెల్‌ రూపొందిస్తున్నారు. తాజా ఈ చిత్రం 2.0.. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమం ముంబయిలోని యశ్‌రాజ్‌ స్టూడియోలో ఘనంగా జరిగింది. కొత్త టెక్నాలజీతో ఈ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కరణ్ జోహార్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి రజనీతో బాటు దర్శకుడు శంకర్,, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజ‌రయ్యారు.

rajini

350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పూర్తిగా త్రీ డీ లో షూట్ చేశామని.. రోబో మొదటి పార్ట్ కన్నా ఈ సీక్వెల్ 10 రెట్లు ఎక్కువగా చిల్లింగ్ గా ఉంటుందని దర్శకుడు శంకర్ పేర్కోన్నారు. మొదటి భాగం తనకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంతగా ఫీలింగ్ ఇస్తే.. ఈ సీక్వెల్ ‌లో భుజంపైనే ఆ శిఖరాన్ని మోస్తున్నట్టు అనుభూతి చెందుతున్నానని అన్నాడు. రజనీ జుట్టు పైన రెడ్ హైలైట్ ఓ ప్రత్యేక ఆకర్షణ అయితే అక్షయ్ కుమార్ రోల్ మరీ థ్రిల్లింగ్ గా ఉంటుంది అని ఆయన పేర్కొన్నాడు. రోబో-3 తీయాలనే ఆలోచన ఉందని ఈ సంధర్బంగా శంకర్ తెలిపాడు.

akshayrobotlook

తన పాతికేళ్ళ కెరీర్ లో ఇలాంటి చిత్రం చేయలేదని అక్షయ్‌ కుమార్ చెప్పాడు. నా మేకప్ కే మూడు గంటలు పట్టేది.. అది తీయడానికి మరో గంట సేపు పట్టేదన్నాడు. బాలీవుడ్ మరో స్టార్ సల్మాన్ ఖాన్..తాను రజనీ ఫ్యాన్ అని, అందుకే ఈ కార్యక్రమానికి తనని ఆహ్వానించకపోయినా వచ్చానని తెలిపాడు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ – ”నిజం చెప్పాలంటే శంకర్‌తో వర్క్‌ చేయడం చాలా కష్టం. అతను ఓ పర్‌ఫెక్షనిస్ట్‌. కాబట్టే 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వుంటూ ఇండియాలోని టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. శంకర్‌తో కలిసి ఇంతకుముందు సినిమాలు చేసినా 2.0 అనేది ఇది 3డి మూవీ. 3డిలో నన్ను నేను చూసుకోవడం చాలా డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. ఇక్కడ మీకో నిజం చెప్పాలి. అదేమిటంటే ఇందులో హీరో రజనీకాంత్‌ కాదు, అక్షయ్‌కుమార్‌ హీరో. క్యారెక్టర్‌ సెలెక్ట్‌ చేసుకునే అవకాశం నాకు ఇచ్చినట్టయితే అక్షయ్‌కుమార్‌ చేస్తున్న క్యారెక్టర్‌ని సెలెక్ట్‌ చేసుకునేవాడ్ని. హ్యాట్సాఫ్‌ టు అక్షయ్‌కుమార్‌. అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత అక్షయ్‌కుమార్‌ని దేశం మొత్తం అభినందిస్తుంది” అన్నారు.

త్రిడీలో ఏర్పాటు చేసిన చిట్టీ అందరినీ ఆకట్టుకుంది. 2.0 చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తున్న‌ది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే దీపావళికి విడుద‌ల కానుంది.

- Advertisement -