వివాదంపై క్లారిటీ ఇచ్చిన జైలర్ రజనీ!

56
- Advertisement -

యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ కాళ్లను సూపర్ స్టార్ రజనీకాంత్ మొక్కడం, వివాదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజన్లు రజనీని దారుణంగా ట్రోల్ చేస్తుండగా దీనిపై క్లారిటీ ఇచ్చారు సూపర్ స్టార్.

ఓ మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ తాను ఓ యోగి అయినా సన్యాసికి కాళ్లు మొక్కానని.. తన కన్నా పెద్ద వయసు వారా చిన్న వారా అని చూడడం అలవాటు లేదు అని వారి కాళ్లకు నేనెప్పుడూ అలానే నమస్కరిస్తాను అని సింపుల్‌గా నవ్వుతూ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేశారు.

రజినీకాంత్ లేటెస్ట్ చిత్రం “జైలర్” భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ అందుకోగా ఈ చిత్రం చూసేందుకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరి కలయికలో రజినీకాంత్ యోగి ఆదిత్యనాథ్ కాళ్లకు నమస్కారం చేయడం వివాదానికి కేరాఫ్‌గా మారింది.

Also Read:హ్యాపీ బర్త్ డే..మెగాస్టార్

- Advertisement -