హిమాలయాల్లో..రజనీ

341
Rajinikanth Begins Annual Pilgrimage
- Advertisement -

ఓ వైపు పొలిటికల్ ఎంట్రీ..మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ రజనీ కాంత్ ఖాళీ సమయాల్లో ఆధ్మాత్మిక యాత్రకు వెళ్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కాలా,2.0 షూటింగ్‌ పూర్తికావడంతో తనకు ఇష్టమైన హిమాలయాలకు వెళ్లారు.

సూపర్ స్టార్ గా ఆయనకు ఎంత స్టార్ డమ్ ఉన్నా, హిమాలయాలకు ఆయన సాధారణ వ్యక్తిగా బయలుదేరి వెళ్లారు. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశించే ముందు కొంతకాలం ధ్యానంలో గడపాలని భావించిన రజనీ…పది రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు.

హిమాలయాల్లో మహావతార్‌ శ్రీ బాబాజీ ఆశ్రమం పేరిట రజనీ ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏటా హిమాలయాలకు వెళ్లే రజనీ.. బాబాజీ భక్తుడు. బాబాజీ నడయాడినట్టుగా భావిస్తున్న దునగిరి పర్వత ప్రాంతాల్లో రూ.కోటి వ్యయంతో ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు.

Rajinikanth Begins Annual Pilgrimage Rajnikanth with friends Superstar_7351

- Advertisement -