నవంబర్ 3న “2.ఓ” ట్రైలర్..!

340
- Advertisement -

రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం “2.ఓ”.
తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లో రీలీజ్ అయ్యే ఈ సినిమాకు కోసం అభిమానులు ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి క్యారెక్టర్ చేస్తున్నాడు.

దీంతో రజినీ, అక్షయ్ అభిమానులు వెయికళ్లతో వేయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో ఎమీ జాక్సన్ రజినీకాంత్‌తో
జోడీ కట్టింది. అయితే.. దీపావళి కానుకగా నవంబర్ 3వ తేదీన సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు యూనిట్
ప్రకటించింది. ఇక నవంబర్ 29వ తేదీన మూవీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే
విధంగా ట్రైలర్ ఉండాలని భావించిన యూనిట్.. అందుకు తగినట్టుగానే ట్రైలర్ కట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడులైన ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

- Advertisement -