మహేష్ థియేటర్లో రజనీ..!

213
mahesh rajanikanth
- Advertisement -

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు న్యూ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటివరకు యాడ్స్‌,సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ ఇకపై మల్టీప్లెక్స్‌ సినిమా బిజినెస్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఏషియన్ సినిమాస్‌తో టై అప్ అయిన మహేష్ హైదరాబాద్,అమరావతిలో మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌ని ఏర్పాటుచేశారు. గచ్చిబౌలిలో ఏఎంబీ పేరుతో మల్టీప్లెక్స్‌ థియేటర్‌ని ప్రారంభించనున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రంతో మల్టీప్లెక్స్‌ని ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన మల్టీప్లెక్స్ కావటంతో ‘2.ఓ’ లాంటి 3డీ విజువల్‌, 4డీ ఆడియోతో రూపొదించిన సినిమాతో ప్రారంభింస్తే బాగుంటుందని మహేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మల్టీప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి రజినీకాంత్‌ స్వయంగా హాజరవుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఒక వేళ ఇదే నిజమైతే గనుక సూపర్ స్టార్ సినిమాతో సూపర్ స్టార్ థియేటర్ ప్రారంభమవటం పెద్ద విశేషమే. ప్రస్తుతం మహేష్-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మహర్షి త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -