రాజస్థాన్‌ బోణీ ..బెంగళూరుకు నాలుగో ఓటమి

321
rcb vs rajasthan
- Advertisement -

ఐపీఎల్ 12లో భాగంగా బెంగళూరు వరుస పరాజాయాలతో సతమతమవుతోంది. బంతితో చివరివరకు పోరాడిన బ్యాటింగ్‌లో మాత్రం అదే తడబాటు. స్టార్ ఆటగాళ్లు ఎంతమంది ఉన్న ఆర్సీబీ ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. బ్యాటింగ్,బౌలింగ్‌లో రాణించిన రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టగా వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది బెంగళూరు.

బెంగళూరు విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కొల్పోయి ఛేదించింది. జోస్‌ బట్లర్‌ (59), స్టీవెన్‌ స్మిత్‌ (38), రాహుల్‌ త్రిపాఠి (34),రాహానే(22) పరుగులు చేయడంతో రాజస్థాన్ గెలుపుబాటపట్టింది.

అంతకమందు టాస్ గెలిచిన బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శ్రేయస్‌ గోపాల్‌ (3/12) స్పిన్‌ మాయాజాలానికి కోహ్లీ,డివిలియర్స్,హెట్‌మెయిర్‌ వెంటవెంటనే వెనుదిరగడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. ఈ దశలో పార్థివ్‌ పటేల్‌ (67) , స్టాయినిస్‌ (31) నాటౌట్‌తో రాణించడంతో బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 158 పరుగులు చేసింది. బౌలింగ్లో రాణించిన శ్రేయస్ గోపాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

- Advertisement -