ఐపీఎల్ 2022 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్తో ఢిల్లీ కేపిటల్స్ జట్టు తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచింది. తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్లు రాజస్థాన్ను ఫస్ట్ బ్యాటింగ్కు ఆహ్వానించింది.
ఇక, ఈ మ్యాచ్లో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. రిపల్ పటేల్ స్థానంలో లలిత్ యాదవ్.. ఖలీల్ అహ్మద్ ప్లేసులో చేతన్ సకారియా తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక, రాజస్థాన్ రాయల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. హెట్మేయర్ స్థానంలో వాన్ డర్ డస్సెన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ జట్టు 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో ఢిల్లీ కూడా 11 మ్యాచ్లు ఆడి కేవలం ఐదింటిలో విజయం సాధించి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో విజయం రాజస్థాన్ జట్టు కంటే కూడా ఢిల్లీకే అవసరం కానుంది.
తుది జట్లు :
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్, కేఎస్ భరత్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రౌమన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జె, చేతన్ సకారియా
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కేప్టన్, వికెట్ కీపర్), దేవ్దత్ పడిక్కల్, రస్సీ వాన్ డెర్ డుస్సెన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేందర్ చాహల్, కుల్దీప్ సేన్