చెన్నైపై రాజస్థాన్ విజయం..

74
csk
- Advertisement -

ఐపీఎల్‌లో కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాణించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ అదరగొట్టింది. ధోని సేన నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే చేధించింది. దీంతో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.రాజస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ‌(59) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఆఖర్లో రవిచంద్రన్ అశ్విన్‌ (40) అదరగొట్టాడు. అశ్విన్ బ్యాటింగ్ లో మూడు సిక్సులు, రెండు ఫోర్లు ఉన్నాయి.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన చెన్నై…నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ 57 బంతుల్లో 93 పరుగులు చేసి చెన్నై 150 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో సంజూ సేన ప్లేఆఫ్స్ రెండో బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

- Advertisement -