చెన్నైకి షాకిచ్చిన రాజస్థాన్..

29
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నై వరుస విజయాలకు బ్రేక్ పడింది. రాజస్ధాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రాజస్థాన్ విధించిన 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై..నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. చెన్నై బ్యాట‌ర్ల‌లో శివ‌మ్ దూబే(52; 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌గా రుతురాజ్ గైక్వాడ్(47; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) పర్వాలేదనిపించారు. మిగితా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో చెన్నై ఓటమి తప్పలేదు.

Also Read:మేమ్ ఫేమస్..మినిమమ్ సాంగ్‌ లాంచ్‌

ఇక అంత‌కముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 202 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైశ్వాల్‌(77; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) దంచికొట్ట‌గా ఆఖ‌ర్లో ధ్రువ్ జురెల్(34; 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), దేవదత్ పడిక్కల్(27 నాటౌట్‌; 13 బంతుల్లో 4 ఫోర్లు) ధాటిగా ఆడ‌డంతో స్కోరు 200 ప‌రుగులు దాటింది.

Also Read:పిక్ టాక్ : బోల్డ్ లుక్ తో మతులు పోగొట్టింది

- Advertisement -