రజనీ..పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ!

67
rajinikanth
- Advertisement -

తమిళనాడు గవర్నర్‌తో భేటీ అయ్యారు సూపర్ స్టార్ రజినీకాంత్ . దాదాపు 30నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పలు విషయాలు చర్చకు రాగా ఈ భేటీపై మాట్లాడేందుకు నిరాకరించారు రజనీ. అయితే వీరిద్దరి భేటీ నేపథ్యంలో మళ్లీ రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చ జరగుతోంది.

కేవలం మర్యాదపూర్వకంగా గవర్నర్‌ని కలుసుకున్నానని…. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపినట్లు రజనీకాంత్ వివరించారు. తమిళనాడు, తమిళుల నిజాయతీ, కఠినశ్రమ, ఆధ్మాత్మిక భావజాలం గవర్నర్ ను ఆకర్షించాయని వెల్లడించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు రజనీ.

వాస్తవానికి 2017లో రాజకీయాల్లోకి వచ్చేందుకు రజనీకాంత్ భారీ ఏర్పాట్లే చేశారు. అయితే తర్వాత 2020 డిసెంబరులో తన ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.

- Advertisement -