Rajamouli: మహేష్ కోసం రాజమౌళి రిస్క్?

12
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో గ్లోబ్ ట్రోటింగ్ మూవీగా ” SSMB29 ” రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పాన్ వరల్డ్ మూవీగా దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న ట్లు తెలుస్తోంది. కనీ విని ఎరుగని రీతిలో యాక్షన్ అడ్వంచర్ మూవీగా రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నాడు. అయితే మహేష్ బాబు తో చేస్తున్న ఈ మూవీ విషయంలో రాజమౌళి తన స్టైల్ కు భిన్నంగా కొత్తగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి మూవీలోనూ ఎమోషన్ బాగా హైలెట్ అవుతూ వచ్చింది. బలమైన పాత్రల మధ్య మనసును కదిలించే ఎమోషన్స్ పండించి ఆడియన్స్ ను తన సినిమాలతో కనెక్ట్ చేస్తాడు రాజమౌళి. .

తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి గత ఏడాది విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ వరకు అన్నీ సినిమాల్లోనూ బలమైన ఎమోషన్స్ హైలెట్ అవుతూ వచ్చాయి. అయితే మహేష్ తో చేయబోయే సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ కావడంతో ఇందులో ఎమోషన్స్ కు చోటు ఉండడం తక్కువేనని కొందరు సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఈ జోనర్ మూవీస్ హాలీవుడ్ లో హిట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ మన ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల హిట్ రేషియో చాలా తక్కువ. దీంతో మహేష్ మూవీ కోసం రాజమౌళి రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఈ ఏడాది నుంచే పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్తగా మేకోవర్ అయ్యేందుకు కసరత్తులు చేస్తున్నాడు. మరి బాహుబలి సిరీస్ తో ప్రభాస్, ఆర్ ఆర్ ఆర్ మూవీస్ తో ఎన్టీఆర్, చరణ్.. వంటి హీరోలను పాన్ ఇండియా స్టార్లను చేసిన రాజమౌళి.. ” SSMB29 ” తో మహేశ్ బాబును ఇంటర్నేషనల్ స్టార్ చేస్తాడేమో చూడాలి.

Also Read:‘విశ్వక్ సేన్’ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

- Advertisement -