ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న సినిమా సలార్. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఈ చిత్రానికి ప్రమోషన్స్ చేయలేదు. ఇంతకు ముందే రాజమౌళి.. మూవీ టీమ్తో ఓ ఇంటర్వ్యూ చేశారని ఇది మూడు రోజుల్లో బయటకి వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఇంటర్వ్యూని ఓ థీమ్ ప్రకారం షూట్ చేసినట్లు తెలుస్తోంది. సలార్ టీమ్తో రాజమౌళి చేసిన ఈ ఇంటర్వ్యూ గ్రే అండ్ బ్లాక్ బ్యాక్ డ్రాప్లో చేశారట. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అలాగే ప్రశాంత్ నీల్ తెలుగు మీడియాతో ఆదివారం నాడు ప్రెస్ మీట్ పెట్టనున్నారని తెలుస్తోంది. అన్నట్టు భారీ అంచనాలున్న ఈ సినిమా తొలి టికెట్ను దర్శక ధీరుడు రాజమౌళి సొంతం చేసుకున్నాడు. నైజాంలో సంధ్య 70 ఎంఎంలో డిసెంబర్ 22న ఉదయం 7 గం.ల షోకు ఏకంగా పది వేలు పెట్టి టికెట్ను కొనుగోలు చేశాడు జక్కన్న. ఈ విషయాన్ని సలార్ నైజాం డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ అనౌన్స్ చేసింది. అయితే, ఈ మూవీ విడుదలకు ముందే సరికొత్త రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ సినిమాను చూసేందుకు 1 మిలియన్కి పైగా ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో వెల్లడించింది.
మొత్తానికి సలార్ మరో 6 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సలార్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా కాబట్టి, పైగా ఈ నెల 22న రిలీజ్ అవుతుంది కాబట్టి, కిస్మస్ సెలవులు ఉన్నాయి కాబట్టి, ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను రాబట్టడం ఖాయం అంటున్నారు. మరోపక్క రాజమౌళి కూడా ప్రభాస్ కోసం సలార్ ప్రమోషన్స్ ను తన నెత్తిన వేసుకుని మరీ కసరత్తులు చేస్తున్నాడు.
Also Read:‘దేవర’లో హైలైట్ ఎపిసోడ్ అదే