రాజమౌళి అందుకే పక్కన పెట్టారా ?

27
- Advertisement -

ఆస్కార్ అవార్డు సాధించి రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీ స్థాయిని పెంచాడు. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. పైగా తెలుగు హీరోలను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ విషయంలో కూడా రాజమౌళి గొప్పతనాన్ని కచ్చితంగా అభినందించి తీరాలి. కానీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిర్మాత విషయంలో రాజమౌళి అశ్రద్ధ చేశాడా ?. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై దానయ్య స్పందించారు. ఈ సమయంలో ఆయన చేసిన కామెంట్స్ వింటే ఆశ్చర్యం కలుగుతుంది.

ఇంతకీ దానయ్య ఏం మాట్లాడాడో విందాం. నాటు నాటు పాటనే 30 రోజులు రిహార్సల్స్ చేసి.. ఉక్రెయిన్ లో 17 రోజులు షూట్ చేశాము. ఆ కష్టానికి ప్రతిఫలంగానే ఆస్కార్ వచ్చింది. ఆస్కార్ అందుకున్నాక రాజమౌళి, కీరవాణి తదితరులతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. అయితే వాళ్లు ఫంక్షన్ లో బిజీగా ఉన్నట్లున్నారు. నా కాల్ వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు. దాంతో నేను వాళ్లతో మాట్లాడలేకపోయాను అని దానయ్య చెప్పారు.

తన సినిమాకి ఆస్కార్ వచ్చింది అంటే.. నిర్మాతగా దానయ్య పాత్ర ప్రముఖమైనది. మరి ఎందుకు దానయ్యను రాజమౌళి నిర్లక్ష్యం చేశాడు ?, ఆస్కార్ అవార్డు కోసం చేసిన ప్రయత్నంలో అయిన ఖర్చులు దానయ్య భరించలేదు. స్వయంగా రాజమౌళి ఆ ఖర్చులను భరించారు. అందుకే.. దానయ్యను పక్కన పెట్టారు అని టాక్ ఉంది. ఏది ఏమైనా తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి ఓ పాటకు ఆస్కార్ రావడం గర్వించదగ్గ విషయం.

ఇవి కూడా చదవండి…

యో యో…రాక్‌స్టార్ మళ్లీ వస్తున్నాడు

పిక్ టాక్ : క్లీవేజ్ షో తో సెగలు పుట్టించింది

పాత దర్శకులకు కొత్త చిక్కులు

- Advertisement -