కవిత ఛాలెంజ్‌ని స్వీకరించిన దర్శకధీరుడు

262
kavitha rajamouli
- Advertisement -

పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ కవిత గ్రీన్ సెల్ఫీ ఛాలెంజ్‌ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కవిత విసిరిన ఛాలెంజ్‌కి మంచి స్పందన వస్తోంది. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ఎంపీ కవిత విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించారు.

మొక్క నాటుతున్న ఫోటోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఛాలెంజ్ స్వీకరించా కవిత గారు…మర్రిచెట్టు,గుల్మొహర్,వేప మొక్కలను నాటాను అని తెలిపారు. అంతేగాదు ఈ ఛాలెంజ్‌ని కేటీఆర్‌,పుల్లెల గోపిచంద్,సందీప్ రెడ్డి వంగా,నాగ్ అశ్విన్‌లకు ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నా అని తెలిపారు.

రాజమౌళి ట్వీట్‌కి ఎంపీ కవిత స్పందించింది. రాజమౌళికి ధన్యవాదాలు తెలిపిన కవిత ఆనందం వ్యక్తం చేసింది. సైనా నెహ్వాల్‌ కూడా కవిత సవాలు స్వీకరించారు. మొక్కలు నాటుతున్న ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన సైనా…. తాప్సి, శ్రద్ధాకపూర్‌, ఈషా గుప్తాలను గ్రీన్ ఛాలెంజ్‌కి నామినేట్‌ చేశారు.

- Advertisement -