హెబ్బాతో 30 సార్లు చేయాలనుంది..

646
- Advertisement -

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.10గా కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా రూపొందుతోన్న చిత్రం `అంధ‌గాడు` స‌క్సెస్‌ఫుల్ రైట‌ర్ వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు.

Raj Tarun, Hebah Patel pair up for Andhhagadu

హీరో రాజ్‌త‌రుణ్‌తో మంచి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో మ‌రోసారి రాజ్‌త‌రుణ్ క‌థానాయ‌కుడుగా వెలిగొండ శ్రీనివాస్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం అంధ‌గాడు. డిఫ‌రెంట్ ,స్ట్రాంగ్ అండ్ ఎగ్జ‌యిట్‌మెంట్ పాయింట్‌తో సినిమా అంతా ర‌న్ అవుతుంది. క‌థ విన‌గానే రాజ్ త‌రుణ్ సినిమా చేయ‌డానికి వెంట‌నే అంగీక‌రించాడట. కుమారి 21ఎఫ్‌, ఈడోర‌కం-ఆడోర‌కం హిట్ చిత్రాల త‌ర్వాత రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జోడి న‌టిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది.

అయితే నిన్న విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి రాజ్ తరుణ్ మాట్లాడాడు. ఈ సినిమాలో కొంతసేపు తాను చూపులేని వ్యక్తిగా కనిపిస్తాననీ, తన పాత్రను దర్శకుడు అద్భుతంగా మలిచాడని అన్నాడు. ఈ పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పాడు. తాను ఇంతవరకూ చేసిన వాటిలో ఈ పాత్ర చెప్పుకోదగినదిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. హెబ్బా పటేల్ తో కంఫర్ట్ జోన్ ఏర్పడిందనీ .. ఆమెతో మరో 30 సినిమాలు చేయాలని ఉందని అన్నాడు. ఈ సినిమాను జూన్ మొదటివారంలో విడుదల చేయనున్నామని చెప్పాడు. ఈ సినిమాలో విలన్ గా రాజా రవీంద్ర నటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -