రాజమౌళికి ధీటుగా దర్శకేంద్రుడి భారీ ప్రాజెక్ట్‌ !

363
- Advertisement -

కె.రాఘవేంద్రరావు అంటే ఒక తరంలో తెలుగు సినిమాకు మూల స్తంభాలుగా నిలిచిన నలుగురు దర్శకులలోనూ ముఖ్యులు. నిన్నటితరం దర్శకులంతా కథలు లేక కనుమరుగైపోతుంటే రాఘవేంద్రరావు మాత్రం ఇప్పటికీ కుర్ర దర్శకులతో పోటీపడుతూ కుర్ర హీరోలతో సినిమాలు తీస్తున్నారు. అన్నమయ్య, రామదాసు, సాయిబాబా,పాండురంగడు వంటి భక్తి రస చిత్రాలు తెరకెక్కించిన దర్శకేంద్రుడు ప్రస్తుతం నాగార్జునతో `ఓం నమో వేంకటేశాయ` చిత్రం తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఆయన మరో భారీ ప్రాజెక్టుకి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఆ సినిమాలో హీరోగా ఎవరో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జనతాగ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్‌తో మళ్లీ తానేంటో చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి ఆ సినిమా చేస్తాడట దర్శకేంద్రుడు.

NTR

రాజమౌళి ‘బాహుబలి’ లాంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన నేపథ్యంలో.. గురువుగారు కూడా విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్దపీట వేసేలా ఓ సినిమా తీయబోతున్నారట. అయితే.. ఈ విషయం మాత్రం అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తారని అంటున్నారు. ఆ సినిమా ఓ పౌరాణిక చిత్రం అయినా ఆశ్చర్యపోనవసరం లేదని టాలీవుడ్ వర్గాల టాక్. అలాగే ఎన్టీఆర్ కూడా ఇప్పటివరకూ ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో చేయటమే కాని డైరక్ట్ గా చేయలేదు. దాంతో ఈ ప్రాజెక్టుకి మంచి క్రేజ్ వచ్చే అవకాశం కనపడుతోంది.

- Advertisement -