లారెన్స్ అనూహ్య నిర్ణయం..! ఫ్యాన్స్ కోసమే..

312
Raghava Lawrence: fans need not come for pictures ..
- Advertisement -

ప్రముఖ నటుడు, కొరియో గ్రాఫర్ రాఘవ లారెన్స్ తన అభిమానుల కోసం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశాడు లారెన్స్‌. లారెన్స్‌తో కలిసి ఫొటో దిగేందుకు శేఖర్ అనే అభిమాని వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన తనను ఎంతో కలచి వేసిందని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనతో కలత చెందిన లారెన్స్, తన అభిమానుల కోసం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.

‘హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్…! నా వీరాభిమాని ఆర్.శేఖర్ నాతో ఫొటో దిగేందుకు తన ఇంటి నుంచి బయలుదేరి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం అందరికీ తెలుసు. అతని అంత్యక్రియల్లో నేను పాల్గొన్నాను. ఈ సంఘటన నన్ను ఎంతో బాధకు గురిచేసింది. ఈ సంఘటనతో నేనో నిర్ణయానికి వచ్చాను. ఇకపై, నాతో కలిసి ఫొటో దిగేందుకు అభిమానులు నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. అభిమానుల వద్దకే నేను వస్తాను. ఇక నుంచి, నాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నా అభిమానులు ఉండే ప్రాంతాలకు వెళ్లి వారితో కలిసి ఫొటోలు దిగుతాను. ముందుగా ఈ నెల 7న సేలంకు వస్తున్నాను.. శేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని ఆ ట్వీట్ లో లారెన్స్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన అభిమాని శేఖర్ ఫొటోను పోస్ట్ చేశాడు.

- Advertisement -