ఏడిద గోపాలరావు మృతి పట్ల కేసీఆర్‌ విచారం..

245
kcr
- Advertisement -

రేడియో న్యూస్ రీడర్‌గా ప్రజలకు చిరపరిచితుడైన ఏడిద గోపాలరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. రేడియోలో వార్తలు చదవడం ద్వారా మాత్రమే కాకుండా రంగస్థల నటుడుగా కూడా గోపాలరావు పేరు ప్రఖ్యాతలు సంపాదించారని సిఎం గుర్తు చేశారు. వివిధ సాంస్కృతిక సంస్థలు, సంఘాల కార్యక్రమాలకు ఆయన ఇతోధిక సహాయ సహకారాలు అందించారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -