‘రాధేశ్యామ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ వచ్చేసింది..

101
- Advertisement -

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధే శ్యామ్’.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక ఈ మూవీని గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలు వ్యవహించారు. మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.

ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇచ్చిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఏప్రిల్ 1 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ అధికారికంగా తెలియజేస్తూ.. పోస్టర్‌తో పాటు ప్రత్యేకంగా ఓ ట్రైలర్‌ని కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -