నటి రాశీ ఖన్నా తన సినీ ప్రయాణాన్ని గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ‘తెలుసు కదా’ నటి రాశీ ఖన్నా మాట్లాడుతూ, ముందుగా, మద్రాస్ కేఫ్ నన్ను ఒక నటిగా ప్రజలు గుర్తించేలా చేసింది, కానీ ఆ తర్వాత నన్ను అన్ని కమర్షియల్ సినిమాలలోనే తీసుకున్నారు అని తెలిపారు.
అయితే, ‘తొలి ప్రేమ’ సినిమాతో తన కెరీర్లో సానుకూల మలుపు వచ్చిందని, ఆ సినిమా తనలోని ప్రతిభను ప్రేక్షకులు మళ్లీ గుర్తించేలా చేసిందని రాశీ ఖన్నా అన్నారు. “తొలి ప్రేమ విషయాలను మార్చింది, కేవలం కమర్షియల్ మొహంగా కాకుండా, నన్ను ఒక నటిగా ప్రజలు చూసేలా చేసింది అని ఆమె పేర్కొన్నారు.
తెలుగు సినిమాలో మరింతగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను పొందేందుకు మరియు తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంచడానికి ఆ చిత్రం కారణమని ఆమె దానికి ఘనత ఇచ్చారు. కాగా, ఆమె నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’లో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
Also Read:రష్యాతో చర్చలపై అమెరికా ప్రణాళిక..

