టీడీపీపై ఎంపీ ఆర్‌ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు!

63
- Advertisement -

టీడీపీపై ఎంపీ ఆర్‌ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను వాడుకొని 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. బీసీల అభివృద్ది కోసం తాను పార్టీలను వాడుకొంటానని…బీసీలు బాగుండాలి, బీసీలు ఎదగాలని పోరాటాలు చేసే తాను పదవుల కోసం పని చేస్తారనేది అపోహ మాత్రమే అన్నారు.

తాను ఏనాడూ పదవుల కోసం పని చేయలేదన్నారు. తనకు రాజ్యసభ పదవి రావడం వల్ల బీసీల ఔన్నత్యం పెరుగుతుందని…రెండు రాష్ట్రాలకు చెందిన బీసీల సమస్యలతో పాటు జాతీయ స్థాయిలో బీసీల సమస్యలను ప్రస్తావిస్తానని చెప్పారు.

1976 నుంచి తాను ఉద్యమంలో ఉన్నానని ఆయన గుర్తు చేశారు. వైసీపీ బీసీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం ఇచ్చిందని ….కొంతమంది బీసీ నేతలు జాతి అభివృద్ధి కోసం తమ ఆస్తులు అమ్ముకుంటున్నారని చెప్పారు.

- Advertisement -