వైసీపీ హయాంలో జరిగిన కీలక కేసుకు సంబంధించిన వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ కృష్ణంరాజు కస్టడీ హింస కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పీవీ సునీల్ కుమార్ తాజాగా సంచలన ట్వీట్ చేశారు.
దర్యాప్తు సక్రమంగా జరగటానికి నన్ను సస్పెండ్ చేశారు. అలాగే సీబీఐ ఎంక్వయిరీ సక్రమంగా జరగాలంటే రఘురామ కృష్ణంరాజును కూడా సస్పెండ్ చేయాలి కదా? అంటూ ఆయన ట్వీట్లో ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ రఘురామ కృష్ణంరాజును సీఐడీ పోలీసులు కస్టడీలో హింసించారనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ కేసులో అప్పటి సీనియర్ పోలీసు అధికారి అయిన పీవీ సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా మారారు. అనంతరం దర్యాప్తు నిమిత్తం ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది.
తాజా ట్వీట్ ద్వారా సునీల్ కుమార్ మరోసారి ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిపై సమాన చర్యలు ఉండాలన్న సంకేతాలు ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తున్నాయి. ఈ ట్వీట్పై రాజకీయ పార్టీలు, న్యాయ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఈ కేసులో సీబీఐ విచారణ పురోగతి ఏ దిశగా సాగుతుందన్నదానిపై కూడా ఉత్కంఠ నెలకొంది.
దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే . మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవులనుండి సస్పెండ్ చేయాలి కదా CBI దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించాలి. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలి pic.twitter.com/qLM6rW3vTk
— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) December 17, 2025
Also Read:వాట్సాప్ డేటా సేకరణ..అనుమతి తప్పనిసరి!

