బోనం సమర్పించిన పీవీ సింధు..

66
bonalu
- Advertisement -

పాతబస్తి లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బోనాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయగా ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సింధు….ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రజలందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఏడాది సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటాని అయితే గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల రాలేకపోయానని చెప్పారు. ఈసారి అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు.

ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

- Advertisement -