పీవీ శతజయంతి కమిటీ సమావేశం…

235
keshavarao
- Advertisement -

హైదరాబాద్‌లో పీవీ శత జయంతి కమిటీ సమావేశం జరిగింది. ఎంపీ కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం జరుగగా పివి జ్ఞానభూమి లో పివి మెమోరియల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పివి మెమోరియల్ ఏర్పాటు చేయడానికి పనులు అన్ని జరుగుతున్నాయని తెలిపారు కేకే. ఆర్కిటెక్ వారు కొన్ని డిజైన్లు చూపించారు..వాటిని కమిటీ పరీశీలించింది…మరో వారం రోజుల్లో కమిటీ మళ్ళీ సమావేశం జరుగుతుందన్నారు.

ఈ నెల చివరిలో పివి మెమోరియల్ డీజైన్ ఫైనల్ చేస్తుంది..పివి శత జయంతి సందర్భంగా సెమినార్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది..ఈ సెమినార్ కు పివి తో పరిచయం ఉన్న ఇతర దేశాల ప్రతినిధులను పిలవాలని భావిస్తోందన్నారు.అమెరికా, మలేషియా కు చెందిన ప్రతినిధులను పిలవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

- Advertisement -