Puvvada:ఓడినా గెలియినా ఖమ్మమే

33
- Advertisement -

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి పువ్వాడ అజయ్.తమది గెలిచినా ఖమ్మమే.. ఓడిపోయినా ఖమ్మమేనని స్పష్టం చేశారు. కానీ కొందరు అలా కాదని.. ఒకసారి ఖమ్మం వైపు చూసి, మరోసారి పాలేరు వైపు పోదామనే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు.

స్వార్ధ రాజకీయాల కోసం ఖమ్మం జిల్లాను బలిపెడదామనుకుంటున్నారని…దానికి ఖమ్మం ప్రజలు సిద్ధంగా లేదని చెప్పారు. ఓ ఓడిపోయిన వ్యక్తికి మ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్కసారి మంత్రి పదవి వచ్చినందుకే ఇంత అభివృద్ధి చేసుకున్నామని.. మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు.

సమయానుకూలంగా అందరికి అవకాశాలు రావాలని అనుకోవాలన్నారు. కొందరికి ఒక్కసారి అవకాశం ఇస్తే దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారని చెప్పారు. అభివృద్ధిలో ఖమ్మం జిల్లా ముందుందని దానిని వెనుకకు నెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read:షర్మిల చూపు తెలంగాణ వైపే!

- Advertisement -