‘పుష్ప 2’ కోసం బన్నీ పార్టీలకు దూరం

16
- Advertisement -

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్ పూర్తి చెయ్యాలనే తపనతో క్రిష్ట్మస్ హాలిడేస్ కి వెళ్లాల్సిన వెకేషన్ ని, ఇంకా సెలబ్రిటీస్ ఇళ్లలో జరిగే పార్టీలని కూడా పక్కనపెట్టేశారు. ఆఖరికి రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన మెగా సెలెబ్రేషన్స్ కి ‘పుష్ప 2’ షూటింగ్ వలనే వెళ్లలేకపోయారు. వచ్చే వారంతో అన్నపూర్ణ స్టూడియోస్ లో పుష్ప 2 షూటింగ్ ఫినిష్ చేసి బన్నీ కాస్త రిలాక్స్ అవుతాడట. ఇక న్యూ ఇయర్ వేడుకల కోసం విదేశాలకి ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు చేసుకున్న ప్లాన్ ను కూడా అల్లు అర్జున్ పోస్ట్ ఫోన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, అల్లు అర్జున్ అంతగా షూటింగ్స్ తో కష్టపడిపోతూ బిజీగా ఉంటే, అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి మాత్రం పార్టీల్లో ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్ గా మెగాస్టార్ క్రిష్ట్మస్ పార్టీకి స్నేహ రెడ్డి హాజరు అయ్యింది. నిజానికి ఈ పార్టీకి బన్నీ కూడా వెళ్లినా.. జస్ట్ పది నిమిషాలు ఉండి, మళ్ళీ వెంటనే పుష్ప 2 షూటింగ్ కి వెళ్ళిపోయాడు. ఆ పది నిమిషాల్లోనే చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహాలతో కలిసి ఓ ఫోటో దిగారు. అంతే, అప్పటి నుంచి మళ్లీ బన్నీ మరో పార్టీకి హాజరు కాలేదు. పైగా రోజుకు 18 గంటల పాటు సెట్ లోనే ఉంటున్నాడు.

స్నేహ రెడ్డి మాత్రం ఫ్యామిలీ పార్టీలతో పాటు నమ్రత, ఉపాసన-చరణ్, శ్రీయ భూపాల్ తో కలిసి బర్త్ డే పార్టీకి కూడా హాజరైంది. మొత్తానికి అల్లు అర్జున్ షూటింగ్స్ తో బిజీగా ఉంటే.. స్నేహ రెడ్డి మాత్రం పార్టీలతో బిజీ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. ‘పుష్ప – 2’ వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న విడుదల చేస్తామని ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read:జూనియర్ ఆర్టిస్ట్‌గా మారిన ఆ హీరోయిన్!

- Advertisement -