త‌న‌యుడితో మ‌రో మూవీకి సిద్ద‌మైన పూరీ..

242
puri
- Advertisement -

టాలీవుడ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న కుమారుడిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ తీసిన మూవీ మెహ‌బూబా. ఈసినిమా విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. ఈమూవీకి స్వ‌యంగా పూరీ జ‌గ‌న్నాథ్ త‌న నిర్మాణ సంస్ధ అయినటు వంటి పూరీ క‌నెక్ట్స్ లో తెర‌కెక్కించారు. ఈచిత్రం వ‌ల్ల పూరీ ఆర్ధికంగా చాలా న‌ష్ట‌పోయాడ‌ని స‌మాచారం.

akash

త‌న త‌న‌యుడితో మ‌రో సాహ‌సం చేయ‌డానికి రెడీ అవుతున్నాడు పూరీ. పూరీ అందించిన క‌థ‌తో కొత్త ద‌ర్శ‌కుడు అనిల్ ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈమూవీలో హీరోయిన్ కోసం చాలా మందిని సంప్ర‌దించార‌ట‌.

mehabooba

అయితే తాజాగా వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం గాయ‌త్రి భ‌రద్వాజ్ అనే అమ్మాయిని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈమూవీతో గాయ‌త్రి తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానుంది. మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

- Advertisement -