డైరెక్టర్‌గా మారనున్న పూరీ కూతురు..

223
- Advertisement -

టాలీవుడ్ లో ఎంత మంది గొప్ప దర్శకులున్నా దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పాలి. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ.. ఒక హీరోను ఆకర్షించే విధంగా చూపించే రెండు నెలల్లోనే సినిమాను పూర్తి చేసే సత్తా ఉన్న దర్శకుడు పూరీ.ప్రస్తుతం పూరీజగన్నాథ్, బాలకృష్ణ కాంబినేషన్‌లో పైసా వసూల్ మూవీ విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. బాలయ్య 101వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో పూరీ కూతురు పవిత్ర ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

Puri Jagannadh's Daughter Turning As A Director

అయితే పూరీజగన్నాథ్ కూతురు పవిత్ర చిన్నప్పటి నుండి చైల్డ్ యాక్టర్ గా చేసింది కాబట్టి.. ఇప్పుడు హీరోయిన్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. తండ్రికి సంబందించిన ఏ సినిమా వేడుకలో అయినా దర్శనమిచ్చి హీరోయిన్ అవుతుందా ఏంటి అనేలా ఆలోచింపజేస్తోంది. కానీ ఆమె హీరోయిన్ అవ్వదట. తండ్రి లాగే దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తుందట పవిత్ర పూరి. అంతే కాకుండా పైసా వసూల్ సినిమాకి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారట. పవిత్ర ఈ సినిమాతో పూరీ వద్ద దర్శకత్వ శాఖలో మెలకువలు నేర్చుకుంటుందట. ఇక ఆమె కూడా త్వరలో పూరి ప్రొడక్షన్ లో సినిమా మొదలెట్టడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది.

- Advertisement -