నందమూరి నటసింహంతో పూరి ‘జనగణమన’..!

239
online news portal
- Advertisement -

డైరక్టర్‌ పూరీ జగన్నాథ్‌కు ఖాళీగా ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఎంత త్వరగా కథలను రాసుకుంటారో, అంతే త్వరగా సెట్స్‌ మీదకు కూడా తీసుకెళుతుంటాడు. అయితే ఈ సారి ‘ఇజం’ తరువాత ఇంకా ఏ మూవీకి కమిట్‌ అవ్వలేదు. పలువురు టాప్‌ హీరోలకు కథలైతే వినిపించాడు కానీ, వాటిని ఫైనలైజ్‌ చేసుకోలేకపోయాడు.

మహేష్‌ బాబు హీరోగా పూరీ జగన్నాథ్‌ ‘జనగణమన’ అనే స్క్రిప్ట్‌ను రాసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి,బిజినెస్ మెన్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో మహేష్‌తో తీసే 3వ సినిమాతో హిట్ కొట్టాలని కసితో ఉన్న పూరి..జనగణమనతో పవర్‌ ఫుల్‌ స్టోరీని రెడీ చేసుకున్నాడు. వీరిద్దరి సినిమా కూడా ఫైనల్ అయ్యిందని అంతా అనుకున్నారు.

mahesh

అయితే ఈ స్టోరీ మహేష్‌కు చెప్పగా ఇంతవరకు రిప్లై రాలేదని, పూరీ జగన్నాథ్‌ రీసెంట్‌గా చెప్పాడు. ప్రస్తుతం మహేష్..మురుగదాస్ సినిమా కంప్లీట్ అయ్యాక కొరటాల శివ డైరెక్షన్‌లో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు.తర్వాత సినిమా కూడా వంశీ పైడిపల్లితో కమిట్ అయ్యాడు మహేష్.దీంతో జనగణమన కోసం కొత్త హీరోను వెతుక్కునే పనిలో పడ్డాడు పూరి.

ఇప్పటికే టెంపర్‌తో ఎన్టీఆర్‌కి బ్లాక్ బస్టర్‌ హిట్‌ ఇచ్చిన పూరి…జనగణమనని ఆయనతో తెరకెక్కిస్తాడన్న వార్తలు వెలువడ్డాయి. అయితే,పుకార్లకు పుల్ స్టాప్ పెడుతు…తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇటీవల బాలకృష్ణ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సర్కర్ సెట్స్ కు వెళ్లిన సంగతి తెల్సిందే. అయితే, బాలయ్య…అమితాబ్‌ను కలిసేందుకు వెళ్లారన్న వార్తలు వచ్చాయి. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీకి…బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ మధ్యకాలంలో వీరిద్దరు కలుసుకున్న సందర్భాలు తక్కువ. దీంతో బాలయ్య…బిగ్ బిని కలిసేందుకు ముంబై వచ్చారన్న వార్తలు వెలువడ్డాయి. కానీ బాలకృష్ణ..ఈ సెట్స్‌ కోసం వెళ్లింది పూరి గురువు రాంగోపాల్ వర్మ కోసమట.

balakrishna

ఈ భేటీలో వీరిద్దరి మధ్య పూరి జనగణమన గురించి చర్చకు వచ్చిందట. జనగణమన కథ నచ్చిన బాలయ్య….తన మనసులోని మాటను వర్మకు చెప్పాడట. జనగణమన కోసం పూరిని ఒప్పించాలని వర్మను కోరాడట. వర్మ సైతం జనగణమన కథ బాగుందని చెప్పాడట. పూరిని ఒప్పించే బాధ్యత తనదేనని చెప్పాడట. దీంతో పూరితో బాలయ్య సినిమా కన్ఫామ్‌ అయినట్లేనని వార్తలు వెలువడుతున్నాయి.

ఇప్పుడు బాలయ్యకు వినిపించేందుకు పూరి దేశభక్తి చిత్రాన్ని రెడీ చేస్తున్నాడని తెలియడంతో, మహేష్ , ఎన్టీఆర్ లకు వినిపించిన జన గణ మన స్టోరీనే.. బాలయ్యకు తగ్గట్టు పూరీ కథను మార్చడం జరిగిందని అందరూ మాట్లాడుకుంటున్నారు.

_Balakrishna

సినిమా ఇండస్ట్రీలో ఒకరికోసం అనుకున్న కథ మరొకరికి షిఫ్ట్ అవ్వడం కొత్తేంకాదు. గతంలో ఎంతో మంది హీరోలకు అలాగే జరిగింది. ఇప్పుడు మహేష్ విషయంలోనూ అదే జరుగుతోందని సినీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గతంలో పూరి…పవన్ కళ్యాణ్ కోసం ఇడియట్ కథను సిద్ధం చేయగా..ఆ సినిమా రవితేజతో తెరకెక్కించి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు పూరి. తర్వాత పవన్‌ కోసం పోకిరి సినిమా కథను సిద్ధం చేయగా….తర్వాత మహేష్ బాబుతో తెరకెక్కించి తెలుగు సినిమా రికార్డులను తిరగరాశాడు. తాజాగా మహేష్ కోసం కథ సిద్ధం చేసినా….బాలయ్యతో తెరకెక్కిస్తారన్న వార్తలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే పూరి ఓ హీరో కోసం కథ సిద్ధం చేసి..వేరే హీరోతో తెరకెక్కించిన ప్రతిసారి…బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టాడు.దీంతో బాలయ్యతో పూరి జనగణమన నిజమైతే…హిట్ కొట్టడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు గుసగులాడుకుంటున్నాయి.

NTR-and-Puri-Jagannath

మొత్తంగా టెంపర్‌తో ఎన్టీఆర్‌కి….ఇజంతో కళ్యాణ్‌ రామ్‌కి మంచి హిట్ ఇచ్చాడు. ఇజంతో కళ్యాణ్‌కి మంచి మార్కులు పడ్డాయి. తాజాగా బాలయ్యతో సినిమా తెరకెక్కిస్తాడన్న వార్తలతో పూరి…నందమూరి ఫ్యామిలీకే పరిమితయ్యాడని ఫిలింనగర్‌లో సరదా టాక్ వినిపిస్తోంది.

- Advertisement -