అక్టోబర్ నుంచి రామ్ తో షురూ

38
- Advertisement -

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి టాలీవుడ్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అయితే, బిడ్డ చచ్చినా పురిటి కంపు పోలేదు అన్నట్టు ఉంది లైగర్ సినిమా పరిస్థితి. ఈ సినిమా వ‌సూళ్లు సాధించ‌లేద‌ని డిస్ట్రిబ్యూట‌ర్స్ పెద్ద గొడ‌వే చేశారు. పూరి ఇంటి పై దాడి చేస్తాం అని బెదిరించారు. ఇది దర్శకుడిగా పూరికి జరిగిన నష్టం. అలాగే మెగాస్టార్, బాలయ్య లాంటి హీరోలు గతంలో పిలిచి సినిమా చేస్తాం అని పూరికి అవకాశాలు ఇచ్చారు. కానీ, లైగర్ ప్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు.

దాంతో పూరికి మళ్లీ సినిమా స్టార్ట్ చేయడానికి చలా సమయం పట్టింది. ఎట్టకేలకు ఎనర్జిటిక్ హీరో రామ్ తో పూరి మరో సినిమా ప్లాన్ చేశాడు. ఇప్పటికే వీరి కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ భారీ విజయాన్ని సాధించింది. నిజానికి గత కొన్ని సినిమాలుగా పూరికి సరైన హిట్ లేకపోవడంతో ఇస్మార్ట్ శంకర్ హిట్, ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. అందుకే, పూరి – రామ్ కలయికలో మరో సినిమా రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలు కానుంది.

Also Read:ఉరూరా గులాబీ జెండా పండుగ

ఇప్పటికే రామ్ డేట్స్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం పూరి ఈ సినిమా స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడు. ఓ గ్యాంగ్ స్టర్ డ్రామాతో రామ్ తో పూరి ఈ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా రామ్.. డాన్ గా సునీల్ శెట్టి నటిస్తున్నాడట. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.

Also Read:IPL 2023 : ఎస్‌ఆర్‌హెచ్ కు.. వార్నర్ శాపం తాకిందా!

- Advertisement -