పూరికి కలిసొచ్చిన A సర్టిఫికేట్..

476
puri jagannath
- Advertisement -

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇస్మార్ట్ శంకర్. నభా నటేష్, నిధి అగర్వాల్ నటించిన ఈసినిమాను పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీలు నిర్మించారు. సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే 56 కోట్ల వసూళ్లను రాబట్టింది. చాలా కాలం తర్వాత పూరి హిట్ కొట్టగా కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ 50 కోట్ల వసూళ్లను రాబట్టాడు హీరో రామ్‌.

ఇక ఈ సినిమా విడుదలకు ముందే పూర్తి నమ్మకంతో ఉన్నాడు పూరి. ఇందుకు తగ్గట్టుగానే సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ఇవ్వడంతో పూరి అంచనాలకు మరింత ఉపిరిపోసింది.

ఎందుకంటే గతంలో పూరి దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి,దేశ ముదురు రికార్డు వసూళ్లను రాబట్టాయి. మహేష్ హీరోగా తెరకెక్కిన పోకిరి ట్రెండ్ సెట్టర్‌ మూవీగా నిలవగా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దేశముదురు…బన్నీకి మాస్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టింది. తాజాగా ఇస్మార్ట్‌ శంకర్‌కు కూడా A సర్టిఫికేట్‌ రావడం,సినిమా విజయం సాధించడంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు పూరి. తన నెక్ట్స్‌ మూవీ డబుల్‌ ఇస్మార్ట్ అంటూ ప్రకటించి స్క్రిప్ట్‌ వర్క్‌ పనిలో బిజీగా ఉన్నాడు. మొత్తంగా చాలా కాలం తర్వాత హిట్ సొంతం చేసుకున్న పూరి మళ్లీ సక్సెస్ ట్రాక్‌ని కొనసాగిస్తాడా లేదా వేచిచూడాలి.

- Advertisement -