లైగర్‌పై ఈడీ దాడి…కష్టాల్లో పూరి !

126
- Advertisement -

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబొర్లా పడింది. దీంతో నిర్మాత పూరితో సహా డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఈ సినిమాకు సంబంధించి పూరి – డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం నడుస్తుండగా తాజాగా పూరి ఆఫీస్‌పై ఈడీ దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమా కోసం జరిగిన నగదు లావాదేవీలపై పూరితో పాటు చార్మి ఇద్దరిని ప్రశ్నించారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై పలు ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై 15 రోజుల క్రితమే పూరికి ఈడీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

విదేశాలకు చెందిన అకౌంట్స్ నుండి డబ్బులు బదిలీ అయినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ వివాదంలో ఇంకా ఎలాంటి సంచలనాలను బయటపడతాయా అని సినీ వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -