TTD:ఘనంగా పురశైవారితోటోత్సవం

14
- Advertisement -

శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీ రామానుజాచార్యుల శిష్యులలో ప్రముఖుడైన శ్రీ అనంతళ్వారు 970వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్‌తోటలో (పురశైవారితోట) ఆదివారంనాడు టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా సుమారు 300 లకు పైగా అనంతళ్వారు వంశీకులు ”నాలాయిర దివ్యప్రబంధ గోష్ఠిగానం” నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామిస్వామి అనుగ్రహషణం చేస్తూ, తన 102 ఏళ్ళ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో స్వామివారికి పుష్పకైంకర్యాన్ని ప్రారంభించి ఉద్దరించిన శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ అనంతాళ్వార్‌ని కొనియాడారు. అనంతాళ్వారు వంశీకులుగతకొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావహం అన్నారు.

అనంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి అనుగ్రహషణం చేస్తూ, తిరుమలలో వివిధ రకాల సుగంధభరిత పుష్పాల మొక్కలతో కూడిన పుష్పాల తోటను ఏర్పరచి, తన జీవితాన్ని భగవంతుని పాదాలవద్ద పుష్పంగా సమర్పించుకున్నారని ఆనంతాళ్వార్‌ జీవిత వైశిష్ట్యం గురించి వివరించారు.తరువాత దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రముఖ శ్రీ వైష్ణవ పండితులచే అనంతాళ్వార్ల జీవిత విశేషాలపై సందేశాన్ని ఇచ్చారు.

Also Read:చింతచిగురుతో ప్రయోజనాలు తెలుసా?

- Advertisement -