పంజాబ్‌ అదుర్స్‌..

183
punjab won in gujarat lions
- Advertisement -

ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది. 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకు చాపచుట్టేసింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా అర్ధ సెంచరీ(65) పరుగులతో మరోమారు సత్తా చాటగా షాన్ మార్స్(30), మ్యాక్స్‌వెల్(31), అక్షర్ పటేల్(34) రాణించారు. లయన్స్ బౌలర్లలో ఆండ్రూ టై 2, స్మిత్, జడేజా, నాథు సింగ్, శుభం అగర్వాల్ చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసి 26 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. లయన్స్ బ్యాట్స్‌మెన్‌లలో దినేశ్ కార్తీక్ (58) పోరాటం ఫలించలేదు. సురేశ్ రైనా(32), ఆండ్రూ టై (22), ఆరోన్ ఫించ్(13), బాసిల్ తంపి (11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ, కరియప్ప, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా మోహిత్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు.

- Advertisement -