ముంబై ఇండియన్స్‌కు 5వ ఓటమి..

61
mayank
- Advertisement -

ఐపీఎల్‌లో 5వ ఓటమిని మూటగట్టుకుంది ముంబై ఇండియన్స్‌. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 12 పరుగులతో ముంబైకి షాకిచ్చింది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై….20 ఓవర్లలో 186/9 స్కోరుకే పరిమితమైంది.

బ్రేవిస్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 49), తిలక్‌వర్మ (20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36) ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించగా.. సూర్యకుమార్‌ (30 బంతుల్లో ఫోర్‌, 4 సిక్సర్లతో 43) ఫామ్‌ చాటాడు. ఓడియన్‌ స్మిత్‌ 4, రబాడ 2 వికెట్లు తీశారు.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 198/5 స్కోరు చేసింది. ధవన్‌ (50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) మయాంక్‌ అగర్వాల్‌ (32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) హాఫ్‌ సెంచరీలు చేశారు. మయాంక్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

- Advertisement -