రాక్షసులు చెలరేగిపోయారు..చంపేయండి

266
salman
- Advertisement -

కశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో 50 మంది మరణించగా రాజకీయాలకు అతీతంగా జవాన్లకు అండగా నిలుస్తున్నారు. ఈ దారుణ ఘటనను ఖండించారు సినీ ప్రముఖులు. సోషల్ మీడియా ద్వారా ఉగ్రమూకలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

()ఉగ్రవాదులను చంపేయండి..మరో సర్జికల్‌ స్ట్రయిక్‌ కావాలన్నారు పూరీ జగన్నాథ్‌.
()మన వీరులకు ఎక్కడా రక్షణ లేదు. పుల్వామా దాడి చాలా బాధాకరం. ఇందుకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి – మంచు మనోజ్‌
()సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి బాధాకరం..మృతుల కుటంబాలకు సంతాపం తెలియజేస్తున్నా – సూర్య
() ప్రేమికుల రోజు జరుపుకొంటున్న వేళ ద్వేషం తలెత్తింది. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి- అభిషేక్‌ బచ్చన్‌‌
()ఎందరో జవాన్ల ప్రాణాలు తీసి, వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిన వారిని క్షమించకూడదు. ఈ నష్టాన్ని తట్టుకునే శక్తి వారి కుటుంబాలకు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా‌- సోనూ సూద్
()రాక్షసులు మళ్లీ చెలరేగిపోయారు. ఏమాత్రం సహించకూడదు- రితేశ్‌ దేశ్‌ముఖ్‌
()దాడిలో మన జవాన్లు వీరమరణం పొందారని తెలిసి చాలా బాధపడ్డాను- అర్జున్‌ కపూర్‌

()మన కుటుంబాలను కాపాడటానికి వారి ప్రాణాలను త్యాగం చేసిన జవాన్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది- సల్మాన్‌

- Advertisement -