ఫైనల్ లో సింధు ఏకపక్షంగా ఆడిందిః కోచ్ గోపిచంద్

443
gopichand
- Advertisement -

స్విట్జ‌ర్లాండ్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ లో సింధు ఏకపక్షంగా ఆడిందన్నారు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్. నిన్న ఉదయం ఇండియాకు చేరుకున్న సింధు ఢిల్లీలోని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుని కలిసింది. ఈసందర్భంగా కోచ్ పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ.. సింధు వరల్డ్ బ్యాడ్మీంటన్ ఛాంపియన్ అవడం గొప్ప విషయం…తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈగెలుపు భవిష్యత్తు ఆటలకు మంచి సంకేతాలిచ్చిందన్నారు. సింధు భవిష్యత్తులో ఇంకా మరెన్నో అద్భతమైన ప్రదర్శనలు ఇస్తుందన్నారు. సెమీస్ లో ఆడిన విధంగానే ఫైనల్ లో కూడా అటాకింగ్ గేమ్ ఆడిందన్నారు. తదుపరి ‌నాలుగు సూపర్ సిరీస్లు,వరల్డ్ సిరీస్లలో మంచి ఆటను కనబరిచేలా సింధూ ఆడుతుందన్నారు. నా బయోపిక్ లో అక్షయ్ కుమార్ నటించడం సంతోషకరంగా ఉంది. నేను అక్షయ్ కుమార్ కు పెద్ద అభిమానిని. ఈసినిమా కోసం తాను కూడా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -