హాకీ అకాడమీని ప్రారంభించిన పుల్లెల గోపిచంద్..

159
- Advertisement -

శుక్రవారం రంగారెడ్డి జిల్లా నాధర్ గుల్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఎంకె హాకీ అకాడమీని బ్యాడ్మింటన్ కోచ్‌ పుల్లెల గోపిచంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముకేశ్ కుమార్, భాస్కర్ రెడ్డి, డిపిఎస్ స్కూల్ చైర్మన్ కొమురయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ.. నాధర్ గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో హాకీ అకాడమీ ప్రారంభించడానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

తెలుగు రాష్ట్రాలలో ప్లేయర్‌లు ఎక్కవ మంది వచ్చే అవకాశం ఉంది వీళ్ళ కోసం మనకి ఈ రోజు ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో అకాడమీ చేయడం చాలా సంతోషం. మన దగ్గర చాలా దగ్గరలో క్రికెట్,బ్యాడ్మింటన్ అకాడమీలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే హాకీ లాంటి స్పోర్ట్స్‌ను ఈ లెవలకి తీసుకు రావడం చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు స్పోర్ట్స్ అంటే ఎంతో ఇష్టం, చదువుతో పాటు ఆటపాటలలో రాణించాలని అన్నారు. స్టేట్ ప్లేయర్ ఎవరైతే నేషనల్‌కు వెళ్లే ప్లేయర్స్ ఇక్కడ ఆడుతున్నారో వీళ్ళను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని.. పిల్లలు స్పోర్ట్స్ ఆడాలని పుల్లెల గోపిచంద్ అన్నారు.

- Advertisement -